Sunday, September 8, 2024
HomeతెలంగాణKTR: ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు 

KTR: ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు 

హైదరాబాద్ లోని ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరును పెడుతున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.  ఎల్బీనగర్ కుడి వైపు ఫ్లైఓవర్ కు మాల్ మైసమ్మ పేరును ఆయన ప్రకటించారు. ఎల్బీనగర్ చౌరస్తాలో 32 కోట్ల వ్యయంతో చేపట్టిన కుడి వైపు ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ మలిదశ ఉద్యమంలో మరణం పొందిన శ్రీకాంతాచారి పేరును ఎల్బీనగర్ చౌరస్తాకు నామకరణం చేసేందుకు వెంటనే తగు ఉత్తర్వులు జారీ చేస్తామని, అదే విధంగా కుడి వైపు ఫ్లైఓవర్ మాల్ మైసమ్మ నామకరణ కు ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి అన్నారు.
వచ్చే సాధారణ ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని, తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని, ఈ విషయం కాంగ్రెస్, బిజెపి నాయకులకు తెలుసునని మాట్లాడేటప్పుడు ఏదో చెప్పాలి కాబట్టి చెప్పారు తప్ప ఆ విషయం టిఆర్ఎస్ విజయం సాధించి అధికారం లోకి వస్తుందని వారికి తెలుసునని మంత్రి అన్నారు. 

- Advertisement -


ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మహేందర్ రెడ్డి, బొగ్గారం దయానంద్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు వెంకటేశ్వర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి టీఎస్ రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి, ఎస్ ఆర్ డి పి ప్రాజెక్ట్  సి ఈ దేవానంద్, ఎస్ సి రవీంద్ర రాజు, ఇ ఇ రేణుక తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News