Saturday, October 5, 2024
HomeతెలంగాణMadhavaram Krishna Rao: కూకట్ పల్లిలో కలియ తిరిగిన కృష్ణారావు

Madhavaram Krishna Rao: కూకట్ పల్లిలో కలియ తిరిగిన కృష్ణారావు

సహాయ సహకారాలు అందించే కార్యక్రమంలో ఎమ్మెల్యే

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ డివిజన్ శబ్ద నగర్ లోని..ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపద్యంలో సఫ్దర్ నగర్లో నాల పక్కన నివసిస్తున్న ప్రజల ఇళ్ళలోకి వరద నీరు రావటంతో ఇబ్బంది పడుతున్న దృష్ట్యా వెంటనే ఆ ప్రాంతాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ అధికారులతో కలిసి పర్యవేక్షించి ప్రజలకు సత్వరమే పరిష్కారం చూపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇంజనీరింగ్ అధికారులకు పక్కా నాల పనులను త్వరలో మొదలు పెట్టాలని, అవసరమైన చోట కల్వర్టులు నిర్మించి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో.. జోనల్ కమిషనర్ మమత.. డిసి రమేష్ .. ఈ ఈ సత్యనారాయణ ..డి ఈ ఆనంద్.. ఏఈ రంజిత్ జిహెచ్ఎంసి అధికారులు డివిజన్ అధ్యక్షులు లింగాల అయిలయ్య పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News