రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంప్ కార్యాలయంలో మహిళలు పెద్ద ఎత్తున చేరుకుని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా వచ్చిన ప్రతి ఆడపడుచుకు చీర కానుకగా అందించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా నియోజకవర్గ ఆడపడుచులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను.. అని అన్నారు… ప్రతి సంవత్సరం రాఖీ కట్టిన ప్రతి సోదరికి నా చిరు కనుకగా చీర అందిస్తున్నామని అలాగే ఈ సంవత్సరం కూడా అందించానని చెప్పారు…
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/248bba36-d9a6-4eec-8a48-f0c7e9e5e19a-1024x576.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/63256f91-5925-43cc-8ec5-1a49c14cadb8-1024x576.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/881836ac-717b-4db3-9db6-3aa00067cbdd-1024x576.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/e0074e50-9dbd-489a-aef0-4e1a92c77608-1024x576.jpg)