Wednesday, September 18, 2024
HomeతెలంగాణMahabubabad: బిజెపికి యువకులే స్టార్ క్యాంపెనర్లు

Mahabubabad: బిజెపికి యువకులే స్టార్ క్యాంపెనర్లు

జాటోతు హుస్సేన్ నాయక్ ఆధ్వర్యంలో చేరికలు

బిఆర్ఎస్ పార్టీకి చెందిన యూత్ జిల్లా నాయకులు నాయిని కృష్ణ మోహన్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తన సహచర యువకులతో కలిసి హుస్సేన్ నాయక్ సమక్షంలో బిజెపిలో చేరారు. వివిధ గ్రామాల, వార్డులకు చెందిన యువకులు దాదాపు 250 మంది మానకోట ఎమ్మెల్యే అభ్యర్థి హుస్సేన్ నాయక్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.

- Advertisement -

ఈ సందర్భంగా మాట్లాడుతూ మానుకోట నియోజవర్గంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం ఖాయమని, ప్రతి ఒక్కరు కూడా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తోడుగా నేనున్నానని, యువకులే బిజెపి స్టార్ క్యాంపెనర్లు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సురేందర్, అసెంబ్లీ కన్వీనర్ సిద్ధార్థ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు చెవిటి ఐలయ్య, మండల అధ్యక్షుడు నవీన్ నాయుడు, పట్టణ ప్రధాన కార్యదర్శి పల్లె సందీప్, మానుకోట మండల కోఆర్డినేటర్, మాజీ ఎంపీటీసీ శ్రీను, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సంపత్, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు రాంబాబు, గిరిజన మోర్చా జిల్లా నాయకుడు నరేష్, శ్రీకాంత్, కిరణ్, మలోత్ బాలు, యుగందర్, బీజేవైఎం జిల్లా నాయకులు సురేందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News