Friday, April 11, 2025
HomeతెలంగాణMallapur: నిందుతుడి రిమాండ్

Mallapur: నిందుతుడి రిమాండ్

పోలీసులకు అభినందనలు

మల్లాపూర్ మండల కేంద్రంలోని దుర్గమ్మ కాలనిలో గత శుక్రవారం జరిగిన హత్యలో నిందుతున్ని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి కోసం గత ఐదు రోజులుగా గాలింపు చేపడుతున్నారు.
మెట్ పల్లి సీఐ నవీన్, మల్లాపూర్ ఎస్సై కిరణ్ ల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని నంది చౌరస్తా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా నిందుతున్ని గుర్తించి పట్టుకున్నట్లు డి.ఎస్.పి ఉమామహేశ్వరరావు తెలిపారు.

- Advertisement -

గంజాయి మత్తులో యువకుడు తన తండ్రిని విచక్షణ రహితంగా నరికి చంపినట్లు నిందితుడు తెలిపినట్లు, నిందితున్ని పట్టుకొని విచారించి రిమాండ్ కు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు. చాకచక్యంగా నిందితుని పట్టుకున్న మెట్పల్లి సీఐ, మల్లాపూర్ ఎస్సై, కానిస్టేబుళ్లను డిఎస్పి అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News