Tuesday, September 17, 2024
HomeతెలంగాణMallapur: బొడ్రాయి, గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ట

Mallapur: బొడ్రాయి, గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ట

కొత్త దాంరాజ్ పల్లి గ్రామంలో బొడ్రాయి, గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా సాగుతోంది. ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు విగ్రహాలకు అభిషేకం నిర్వహించి అనంతరం హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సి ఎస్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాసరావు -లత దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బద్దం సరిత, కమలాకర్ రెడ్డి, ఎంపీపీ సరోజన ఆది రెడ్డి, ఉప సర్పంచ్ లత గంగాధర్, గ్రామ సేవా సమితి సభ్యులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News