Monday, September 30, 2024
HomeతెలంగాణMallapur: నలుగురికి ప్రాణం పోసి..తనువు చాలించి..

Mallapur: నలుగురికి ప్రాణం పోసి..తనువు చాలించి..

దుబాయ్ లో బ్రెయిన్ ట్యూమర్ తో యువకుడు మృతి

పొట్ట కూటి కోసం వలస వెళ్లి, కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తు బ్రెయిన్ ట్యూమర్ తో యువకుడు మృతి చెందాడు. పరాయి దేశంలో మెట్ పల్లి పట్టణానికి చెందిన పీసు సతీష్ రెడ్డి అకాల మరణం చెందాడు. పనులు ముగించుకొని రూమ్ కు చేరుకొని తోటి మిత్రులతో కలిసి చాయ్ తాగడానికి వెళ్లి హటాత్తుగా సతీష్ అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే సతీష్ ను మిత్రులు ఆసుపత్రికి తరలించారు. బ్రెయిన్ టుమార్ తో విగాత జీవిగా సతీష్ మారాడని వైద్యులు తెలిపారు. సతీష్ ఆరోగ్య పరిస్థితిని వాళ్ళ అమ్మకు తెలియజేయగా రెడ్ క్రాస్ సంస్థ వారి సౌజన్యంతో సతీష్ అవయవలు దానం చేశారు. దానితో నలుగురికి జీవం పోసి తనువు చాలించాడు. సోమవారం మెట్ పల్లి పట్టణంలో అశ్రునాయనాల మధ్య అంత్యక్రియలు జరిపారు. అందరితో కలిసి మెలిసి ఉండి చిన్నతనంలోనే అకాల మరణం చెందటం పట్ల పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News