Saturday, October 5, 2024
HomeతెలంగాణMallapur: వచ్చేది మన సర్కారే- అరవింద్

Mallapur: వచ్చేది మన సర్కారే- అరవింద్

బూత్ స్థాయి కార్యకర్తలే కీలకం

రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్. మల్లాపూర్ మండలంలోని సిర్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి కమిటీ సభ్యుల సమావేశంలో ధర్మపురి అరవింద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా అరవింద్ మాట్లాడుతూ దేశంలో చెరుకు రైతులకు అండగా ఉన్నది మోడీ ప్రభుత్వం అని దేశంలో మూతపడ్డ అనేక చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందని, ఇక్కడ ఉన్న కేసీఆర్ అహంకారంతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని రైతుల పాలిట శాపంగా మారారని వారి కుటుంబ స్వలాభం కోసం రాష్ట్ర ప్రజలతో చెలగాటం ఆడుతున్నారని, కాంగ్రెస్, టిడిపి, బీ ఆర్ఎస్ ప్రభుత్వాలు చక్కెర ఫ్యాక్టరీని మూతపడడానికి మూల కారకులని, చెరుకు రైతులు అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారని, బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక చక్కెర ఫ్యాక్టరీ పునః ప్రారంభిస్తామని అరవింద్ అన్నారు.

- Advertisement -

బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక వరి కోతలు పూర్తి కాకముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి తప్ప, తాలు అనేది లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అన్నారు. బూతు స్థాయి కార్యకర్తలే రాబోయే ఎన్నికల్లో కీలకంగా మారుతారని ప్రతి ఒక్క బూత్ స్థాయి కార్యకర్త కష్టపడి బిజెపి పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేయాలని, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలని ప్రజలకు చేరవేసే బాధ్యత పూర్తిస్తాయి కార్యకర్తలదేనని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్, డాక్టర్ జె ఎన్ సునీతవెంకట్, బిజెపి సీనియర్ నాయకులు బద్దం గంగాధర్ రెడ్డి, సుకెందర్, మండల అధ్యక్షులు మద్దం సత్యనారాయణ, సీనియర్ బీజేపీ నాయకులు గోపిడి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం నవీన్ రెడ్డి, ఎంపీటీసీలు గున్నాల శ్రీనివాస్, రాజేందర్, యువజన నాయకులు ఇట్టేడి శేఖర్, లవంగ శివ, బైన ప్రశాంత్, దండగుల అంజిరాజ్, వివిధ మోర్చాల నాయకులు, మహిళ నాయకులు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News