Friday, October 18, 2024
HomeతెలంగాణMallapur: డాక్టర్ అయిన రైతు బిడ్డకు ఘన సన్మానం

Mallapur: డాక్టర్ అయిన రైతు బిడ్డకు ఘన సన్మానం

ఎమ్మెల్యే సన్మానం

మొగిలిపేట గ్రామీణ ప్రాంతానికి చెందిన, రైతు కుటుంబానికి చెందిన మిట్టపల్లి సుమ పట్టుదలతో చదివి ఎంబీబీఎస్ పూర్తిచేసింది. డాక్టర్ సర్టిఫికెట్ సాధించిన మిట్టపల్లి సుమను టీపీసీసీ డెలిగేట్ సభ్యులు కల్వకుంట్ల సుజిత్ రావు శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా సుజిత్ రావు మాట్లాడుతూ పట్టుదలతో చదివి డాక్టర్ కోర్సు పూర్తి చేసినందుకు అభినందనలు తెలుపుతూ, రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రజానికానికి సేవలందించలని, మంచి డాక్టర్ గా పేరు సంపాదించాలని, ప్రజలకు ఉత్తమ సేవలందించాలని కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఎనేడ్ల రాం రెడ్డి, మిట్టపల్లి మహేష్, గోవర్ధన్,జలపతి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News