Sunday, July 7, 2024
HomeతెలంగాణMallapur: రైతుల సంక్షేమమే BRS ధ్యేయం

Mallapur: రైతుల సంక్షేమమే BRS ధ్యేయం

రైతాంగం మేలు కోరేది తెలంగాణ ప్రభుత్వం అని, రైతులకు మేలు జరిగేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వాగులపై చెక్ డ్యామ్ లను నిర్మించిందని బీఆర్ఎస్  రాష్ట్ర నాయకులు డా. కల్వకుంట్ల సంజయ్ కుమార్ అన్నారు. మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో నిర్మించిన చెక్ డ్యామ్ ను స్థానిక రైతులతో కలిసి సంజయ్ సందర్శించారు. అనంతరం రైతులు పండించిన పంటలను పరిశీలించారు.  చెక్ డ్యామ్ వల్ల రైతులకు జరిగే మేలును ఆయన స్వయంగా రైతులకు వివరించి చెప్పారు.  ఈ కార్యక్రమంలో చిట్టాపూర్ పాక్స్ చైర్మన్ నేరెళ్ల మోహన్ రెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ సురుకంటి అంజిరెడ్డి, రైతులు సురుకంటి హన్మండ్లు, నోముల రాజారెడ్డి, గడ్డం హన్మండ్లు, తొర్తి హరీష్, దేవేందర్, ప్రవీణ్ రెడ్డి, రాజేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News