Monday, November 17, 2025
HomeతెలంగాణMallapur: ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరుపుకోవాలి

Mallapur: ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరుపుకోవాలి

మల్లాపూర్ ఎస్సై కిరణ్ కుమార్ గౌడ్

గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగుస్తున్నందున, నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ప్రశాంత వాతావరణంలో గణేశుని నిమజ్జనం చేయాలని, మల్లాపూర్ మండల గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులకు , యువజన సంఘాల కమిటీ లకు మల్లాపూర్ ఎస్సై కిరణ్ కుమార్ గౌడ్ సూచించారు.

- Advertisement -

నిమజ్జనం రోజున ప్రజలకు ఇబ్బందులు కలిగేలా చేయద్దని, అల్లర్లు జరగకుండా చూసుకునే బాధ్యత ఆయా యువజన సంఘాలపై బాధ్యత ఉందని, చెరువులో గణేశుని నిమజ్జనం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని, చిన్నపిల్లలను నిమజ్జనంకు దూరంగా ఉంచాలని, విద్యుత్ పట్ల నిర్లక్ష్యం వహించ రాదని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని ఎస్సై తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad