Sunday, October 6, 2024
HomeతెలంగాణMallapur: గల్ఫ్ కార్మికునికి బాసటగా నిశాంత్ కార్తికేయ

Mallapur: గల్ఫ్ కార్మికునికి బాసటగా నిశాంత్ కార్తికేయ

ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లి కూటి కోసం కష్టపడుతూ ఉపాధి వేటలో అనారోగ్యం పాలై, పరాయి దేశంలో అనారోగ్యంతో బాధపడుతున్న వేంపల్లి గ్రామానికి చెందిన చెందనగిరి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర నాయకులు పూదారి నిశాంత్ కార్తికేయ కలిశారు. వారితో మాట్లాడి అండగా ఉంటా అని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నిశాంత్ కార్తికేయ మాట్లాడుతూ దుబాయ్ నుంచి వచ్చేలా అన్ని ప్రయత్నాలు చేశానని, తొందరలోనే ఇంటికి వస్తాడని తెలిపారు. ఇంటికి వచ్చాక హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అందేలా చూస్తానని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యుల ఆర్ధిక పరిస్థితులు చూసి వారికి 5,000 రూపాయలు అందజేశారు. అనంతరం వేంపల్లి గ్రామంలో గ్రూప్స్ పరీక్షల కోసం సిద్ధం అవుతున్న యువతీ యువకులకు స్టడీ మెటీరియల్ అందించారు. వేంపల్లి గ్రామ యువకుల కోరిక మేరకు స్టడీ మెటీరియల్ గ్రంథాలయంలో అందుబాటులో ఉంచారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో బీజేపీ మల్లాపూర్ పట్టణ అధ్యక్షుడు లవంగ శివ కుమార్, బీజేపీ మల్లాపూర్ మండల ఉపాధ్యక్షుడు ఎంపి దివాకర్ రెడ్డి, బీజేవైఎం మల్లాపూర్ మండల ప్రధాన కార్యదర్శి రాఖీ పటేల్, ధనుష్, వెల్మల రాజా శేఖర్, వేంపల్లి బూత్ అధ్యక్షుడు గణేష్, పేనుకుల శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News