Tuesday, October 1, 2024
HomeతెలంగాణMallapur: కేంద్రంలో, రాష్ట్రంలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే

Mallapur: కేంద్రంలో, రాష్ట్రంలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే

బీజేపీలో చేరిన యువకులు, మహిళలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంపై నమ్మకంతో యువత, మహిళలు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారని బీజేపీ పార్టీ కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ అన్నారు. మండలంలోని మొగిలిపేటలో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ సుఖేందర్ గౌడ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నడికూడ, మొగిలిపేట, వివిధ గ్రామాలకు చెందిన మహిళలు యువకులు సుమారు 400 మంది బిజెపి పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీన్ కుమార్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.

- Advertisement -

ఈ సందర్బంగా సురభి నవీన్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ చేస్తున్న అవినీతి, దోపిడీ పాలనకు వ్యతిరేకంగా రాబోయే రోజులలో మరింత మంది భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారని నవీన్ కుమార్ వెల్లడించారు. భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజల సహకారంతో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గ గడ్డపై కాషాయ జెండాను ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ముద్దం సత్యనారాయణ గౌడ్, సీనియర్ నాయకులు పిసరీ అనిల్ కుమార్, శక్తి కేంద్ర ఇన్చార్జిలు, బూత్ కమిటీ సభ్యులు, నాయకులు, బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News