Monday, May 20, 2024
HomeతెలంగాణMallapur: మనకు అందుబాటులో ఉండే, మనందరి మనిషి జీవన్ రెడ్డి

Mallapur: మనకు అందుబాటులో ఉండే, మనందరి మనిషి జీవన్ రెడ్డి

టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు పాల్గొన్నారు. మండలంలోని కొత్త దాం రాజ్ పల్లి, పాత ధాంరాజ్ పల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా సుజిత్ రావు మాట్లాడుతూ…
దేశంలో నిరంకుశ పాలన చేసిన బీజేపీ ప్రభుత్వన్ని గద్దె దించల్సిన సమయం ఆసన్నమైంది అని మత ద్వేషాలతో రెచ్చగొడుతూ పదేండ్లు దేశాన్ని పాలించారు దేశంలో ఒకటే పార్టీ ఒక్కటే మతం ఉండాలి అనేది వారి సిద్ధంతం ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటు అన్న తమ్ముళ్ల వుండే ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేస్తున్న బీజేపీ కి తగిన గుణపాఠం చెప్పాలి, దేవుని ముందు పెట్టే అగర్భత్తి పైన కూడా GST వేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలపై భారం మోపేవిధంగా నిరంకుశ హిట్లర్ పాలన కొనసాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్లు దేశాన్ని పాలించిన రాహుల్ గాంధీ కుటుంబానికి ఇప్పటి వరకు సొంత ఇల్లు కూడా లేదు కానీ దేశ ప్రజలాందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కూడా వారిదని ఆయన అన్నారు. దేశంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ఎన్నో సంక్షేమ పధకాలు తీసుకొచ్చి అభివృద్ధిపథంలో నడపటంలో కీలక పాత్ర కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు.

- Advertisement -


ప్రతి గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ సంక్షేమ పథకాలు వివరించాలని కోరుతూ, నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఒకసారి మన జీవన్ రెడ్డిని గెలిపించండని, అందరికీ అందుబాటులో వుండే వ్యక్తి అందరి మధ్య వుండే మన జీవన్ రెడ్డికి ఓటు వేస్తే మన నాయకులు రాహుల్ గాంధీకి వేసినట్టే అని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల. చిన్నా రెడ్డి, ఫిషర్మెన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త. నారాయణ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు మామిడి. రాజ శేఖర్ రెడ్డి, బద్దం. సుధాకర్ రెడ్డి, గడ్డం. నవీన్ రెడ్డి, నేవూరి శ్రీధర్, పన్నాల. జీవన్, కూన గోవర్ధన్, శ్రీకాంత్,ఇప్ప పెల్లి గణేష్, గోపిడి నరేష్, రాజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News