Saturday, October 12, 2024
HomeతెలంగాణMallapur: కాంగ్రెస్ లో చేరికలు

Mallapur: కాంగ్రెస్ లో చేరికలు

సముచిత ప్రాధాన్యం ఇస్తాం

మల్లాపూర్ మండలం మొగిలపేట గ్రామంలో టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు సమక్షంలో బిఆర్ యస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చిట్టాపూర్ ఎంపీటీసీ మైస లక్ష్మి గణపతి, Ex ఎంపీటీసీ సింగారపు అశోక్, మొగిలపేట గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు గంధం రాజేషం, సింగారపు లక్ష్మి, SK మోసిన్ లకి సుజిత్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -

పార్టీలో నూతనంగా చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని వాళ్ల సేవలు పూర్తిస్థాయిలో పార్టీ ఉపయోగించుకుంటుందని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు సుజిత్ రావు సూచించారు.

ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నా రెడ్డి, రాష్ట్ర కిసాన్ సేల్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి,టిపిసిసి ఫిషర్మెన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు అందె మారుతీ,మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కుతబ్ పాషా,ఎన్నెడ్ల రాములు,మహబూబ్ ఖాన్, ఏలేటి జలపతి రెడ్డి,మాసుల చిన్నయ్య, దండవేణి రాజేందర్, గోల్కొండ రమేష్, మిట్టపెల్లి మహేష్, నైనేని రాజేందర్, మద్దురి రాజు, యండి సల్మాన్ ఖాన్, వరద సురేష్, గంధం రాజేందర్,దేవా రవి,తిపన్ని సాయి,గోల్కొండ ప్రవీణ్,మసుల బుచ్చి రెడ్డి, సుద్దాల సతీష్, గంగుల వెంకటేష్, ఎర్రంశెట్టి వంశీ,బండపెల్లి నర్సయ్య, బండపెల్లి స్వామి, షైక్ మోహినుద్దిన్సామ మహేష్, ఎన్నెడ్ల లింగ రెడ్డి,వెంకట గిరి,ఇప్పపల్లి గణేష్, గోపిడి నరేష్ గ్రామ కాంగ్రెస్ ముఖ్యనాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News