Sunday, July 7, 2024
HomeతెలంగాణMallapur: మల్లాపూర్ చెరువును పరిశీలించిన కల్వకుంట్ల సంజయ్

Mallapur: మల్లాపూర్ చెరువును పరిశీలించిన కల్వకుంట్ల సంజయ్

వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న నేత

భారీ వర్షానికి మల్లాపూర్ ప్రధాన చెరువు కట్ట, దుర్గమ్మ చెరువు కట్టలు తెగిపోయాయి . వరద నీరు అధికంగా రావడం వల్ల చెరువు కట్ట తెగి కిందికి నీరు వెళుతుంది.తెగిన చెరువు కట్టను బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల సంజయ్ కుమార్ పరిశీలించారు. స్థానిక నాయకులతో కలిసి తెగిన చెరువు కట్టలను పరిశీలించారు. జాగ్రత్తగా ఉండాలని, వర్షానికి బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. జడ్పిటిసి సంధి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మెట్ పల్లి ఎంపీపీ సాయి రెడ్డి ,తహసీల్దార్ రవీందర్,ఆర్బిఎస్ చైర్మన్ కొమ్మల జీవన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తోట శ్రీనివాస్, వైస్ ఎంపీపీ నగేష్, నాయకులు జీవన్ రెడ్డి, సురేష్, శరత్, సతీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News