Friday, September 20, 2024
HomeతెలంగాణMallapur: నిరుపేద రెడ్డి కుటుంబానికి అండగా మెట్ పల్లి డివిజన్ రెడ్లు

Mallapur: నిరుపేద రెడ్డి కుటుంబానికి అండగా మెట్ పల్లి డివిజన్ రెడ్లు

సతీష్ రెడ్డి కుటుంబానికి అండగా సొంత సామాజికవర్గం

ఉపాధి కోసం వలస వెళ్లి, అకాల మరణంతో మృతిచెందిన సతీష్ రెడ్డి కుటుంబానికి మెట్ పల్లి డివిజన్ రెడ్లంతా బాసటగా నిలిచారు. గత వారం దుబాయ్ లో బ్రెయిన్ డెడ్ తో మరణించిన పీసు సతీష్ కు ఉండటానికి కనీసం ఇల్లు కూడా సరిగా లేదు. సతీష్ ది నిరుపేద కుటుంబం అని తెలుసుకొన్న రెడ్డి మాజిక పెద్దలంతా కలిసి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. నిరుపేద రెడ్డి కుటుంబానికి మెట్ పల్లి రెడ్డి డివిజన్ సభ్యులు అండగా నిలిచారు. ఉండడానికి సరియైన ఇల్లు లేక పేదరికంలో ఉన్న సతీష్ కుటుంబానికి డివిజన్ రెడ్డిలు 1,52,002 రూపాయల ఆర్థిక సహాయాన్ని సతీష్ వాళ్ళ అమ్మకు అందజేశారు. అలాగే నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు.. ఇట్టి కార్యక్రమంలో రెడ్డి డివిజన్ సభ్యులు నేరెళ్ల మోహన్ రెడ్డి, బద్దం శ్రీనివాస్ రెడ్డి నవీన్ రెడ్డి, మహేందర్, మాధవ్, సతీష్, శ్రవణ్, తిరుపతి, రాజేష్,అజయ్, దుర్గ ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News