Friday, September 20, 2024
HomeతెలంగాణMallapur: గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన

Mallapur: గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన

మల్లాపూర్ లోని కొత్త దాంరాజ్ పల్లిలో బొడ్రాయి, గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా సాగింది. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న చెన్నమనేని శ్రీనివాసరావు -లత దంపతులు పాల్గొన్నారు. కొత్త దాంరాజ్ పల్లి గ్రామంలో బొడ్రాయి గ్రామదేవతల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. విశ్వేశ్వర మహా పిఠాధిపతి శ్రీ శ్రీ ప్రణవనంద స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చెన్నమనేని శ్రీనివాసరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన వంతుగా లక్ష రూపాయలను గ్రామ సేవా సమితి సభ్యులకు అందించారు. శ్రీనివాసరావు దంపతులకు పట్టు వస్త్రాలను సేవా సమితి సభ్యులు అందించారు.

- Advertisement -

గ్రామంలోని మహిళలు బోనాలు సమర్పించారు. గ్రామ విధుల గుండా బోనాలు ఊరేగించి బొడ్రాయికి సమర్పించారు. గ్రామదేవతలకు, బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ఆడబిడ్డలందరు కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమానికి బిజెపి నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బద్దం సరిత ఉపసర్పంచ్ లత, ఎంపీపీ సరోజన , గ్రామ సేవా సమితి సభ్యులు గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News