Friday, April 11, 2025
HomeతెలంగాణManchiryala: మంచిర్యాల కాంగ్రెస్ కు భారీ షాక్

Manchiryala: మంచిర్యాల కాంగ్రెస్ కు భారీ షాక్

బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ నేతలు

మంచిర్యాల కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సమక్షంలో బీఆర్ ఎస్ లో లక్సెట్టి పేట zptc ముత్తె సత్తయ్య చేరారు. తిమ్మాపూర్ ఉప సర్పంచ్ ముత్తె రాజకుమార్, లక్షేట్టిపేట సీనియర్ నాయకుడు సూరం చంద్రమౌలితో పాటు వాళ్ళ అనుచరులు కూడా బీ ఆర్ ఎస్ లో చేరిపోయారు. కరీంనగర్ లో జరిగిన కార్యక్రమంలో జడ్పీటీసీ, ఇతర నాయకులను బీఆర్ఎస్ కండువాలు కప్పి ఆహ్వానించారు కేటీఆర్.
ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News