Sunday, July 7, 2024
HomeతెలంగాణMinister Harish Rao: మావి న్యూట్రిషన్ పాలిటిక్స్.. ప్ర‌తిప‌క్షాల‌వి పార్టిషన్ పాలిటిక్స్

Minister Harish Rao: మావి న్యూట్రిషన్ పాలిటిక్స్.. ప్ర‌తిప‌క్షాల‌వి పార్టిషన్ పాలిటిక్స్

Minister Harish Rao: గర్భిణుల్లో రక్తహీనతను తగ్గించి, మాతృ మరణాలను నివారించడమే లక్ష్యంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి తెలంగాణ ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా బుధ‌వారం తొమ్మిది జిల్లాల్లో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. కామారెడ్డి కలెక్టరేట్ నుంచి వర్చువల్ మోడ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్ర‌భుత్వ విప్ బాల్క సుమన్‌, భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్, ములుగు జిల్లాలో సత్యవతి రాథోడ్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, వికారాబాద్ జిల్లాలో మంత్రి సబిత ఇంద్రారెడ్డి, నాగర్‌ కర్నూల్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్, గద్వాల్ జిల్లాలో నిరంజన్‌ రెడ్డిలు పాల్గొని ఆయా జిల్లాల నుంచి ప్ర‌సంగించారు. అనంతరం గర్భిణుల వద్దకు వెళ్ళి కిట్స్ పంపిణీ చేశారు. ఇదే వేడుకగా ఏఎన్ఎంలకు చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు.

- Advertisement -

కామారెడ్డి జిల్లాలో మంత్రి హ‌రీష్‌రావు మాట్లాడుతూ.. బిడ్డ కడుపులో పడ్డప్పుడు న్యూట్రిషియ‌న్ కిట్లు, డెలివరీ అయిన తర్వాత కేసీఆర్‌ కిట్, గర్బిణిగా ఉన్నపుడు న్యూట్రీషన్‌ కిట్, బాలింతగా ఉన్నపుడు కేసీఆర్‌ కిట్‌ను సీఎం కేసీఆర్ అంద‌జేస్తున్నార‌ని, తద్వారా గ‌ర్భిణీల్లో ర‌క్త‌హీన‌త లేకుండా చ‌ర్య‌లు తీసుకోవ‌టం జ‌రుగుతుంద‌ని అన్నారు. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కులు ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీఎం కేసీఆర్‌వి న్యూట్రిషన్ పాలిటిక్స్.. ప్ర‌తిప‌క్షాల‌వి పార్టిషన్ పాలిటిక్స్ అని అన్నారు. మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టింద‌న్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్‌ కిట్‌ సూపర్‌ హిట్‌ అయింద‌ని, ఇదే స్ఫూర్తితో కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్లకు రూపకల్పన చేశామ‌న్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనతో పుట్టిన కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్‌ పథకాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంద‌న్నారు. ఇదొక చారిత్రక ఘట్టం అని మంత్రి హ‌రీష్‌రావు పేర్కొన్నారు.

ఎక్కువగా ఎనీమియా (రక్త హీనత) ప్రభావంతో ఉన్న గర్బిణుల సంఖ్య తొమ్మిది జిల్లాల్లో ఉన్నట్లు గుర్తించడం జరిగింద‌ని అన్నారు. మొత్తం1.25 లక్షల మంది గ‌ర్బిణుల‌కు రెండు ఏఎన్‌సీల్లో మొత్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసింద‌ని, దీని కోసం ప్రభుత్వం రూ. 50 కోట్లు ఖర్చు చేస్తున్నద‌ని మంత్రి హ‌రీష్‌రావు తెలిపారు. ప్రోటీన్స్‌, మిన‌ర‌ల్స్‌, విట‌మిన్స్, ఐరన్ ల‌ను పోష‌కాహారం ద్వారా అందించి ర‌క్త హీన‌త త‌గ్గించ‌డం, హీమోగ్లోబిన్ శాతం పెంచ‌డం న్యూట్రీషన్‌ కిట్ల లక్ష్యమ‌ని తెలిపారు. తొమ్మిది జిల్లాల్లోని 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వం ఈ కిట్లు పంపిణీ చేస్తున్నద‌ని తెలిపారు. రాష్ట్రంలో మాతృ మరణాల రేటు 2014లో 92 ఉండగా, ప్రస్తుతానికి 43కు తగ్గింద‌ని, మాతృమరణాలు తగ్గించడంలో దేశంలోనే మనం మూడో స్థానంలో నిలిచామ‌ని హ‌రీష్‌రావు అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News