Sunday, July 7, 2024
HomeతెలంగాణPonnam: రాష్ట్రంలో భూదంధాలన్నీ బయటపెడతాం

Ponnam: రాష్ట్రంలో భూదంధాలన్నీ బయటపెడతాం

సమ్మక్క సారలమ్మల సేవలో మంత్రి

సమ్మక్క సారలమ్మ తల్లుల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుజురాబాద్ మండలం జూపాక, వీణవంక మండల కేంద్రంలోని సమ్మక్క సారలమ్మ తల్లులను కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ తో కలిసి దర్శించుకున్నారు.
అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యల పరిష్కారం దిశగా పనిచేస్తుందని అన్నారు.

- Advertisement -


అమ్మవారి ఆశీర్వాదంతో రాబోయే కాలంలో సమృద్దిగా వర్షాలు పడి పాడి పంటలతో పిల్లా పాపలతో తెలంగాణ రాష్ట్రమంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలనేదే తమ ఆకాంక్ష అని అన్నారు. కరీంనగర్ తో పాటు వివిధ పట్టణాల్లో భూదందాలు చేసినవన్నీ బయటపెడతామని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News