Monday, November 17, 2025
HomeతెలంగాణGadari: 'గృహలక్ష్మి' పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Gadari: ‘గృహలక్ష్మి’ పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

263 మంది లబ్ధిదారులకు పట్టాలు

మోత్కూర్ మండల కేంద్రంలోని మధుర మీనాక్షి ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకం ద్వారా మోత్కూరు మండలం, మోత్కూరు మున్సిపాలిటీలోని పలు గ్రామాలకు వార్డులకు చెందిన 263 మంది లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీపి రెడ్డి సావిత్రి మెగా రెడ్డి, జెడ్పిటిసి గోరుపల్లి శారద సంతోష్ రెడ్డి, ఎంపీపీ రచ్చ కల్పన లక్ష్మీనరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పొన్నబోయిన రమేష్, కళ్యాణ్ చక్రవర్తి, మాజీ మార్కెట్ చైర్మన్ కొనతం యాకుబ్ రెడ్డి, రైతు సేవ సహకార సంఘం అధ్యక్షులు కంచర్ల అశోక్ రెడ్డి, కొండ సొమ్మలు, దాసరి తిరుమలేష్, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, సర్పంచ్లు, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad