Friday, September 20, 2024
HomeతెలంగాణKolcharam: దుర్గామ్మకు ఎమ్మెల్యే మదన్ రెడ్డి పూజలు

Kolcharam: దుర్గామ్మకు ఎమ్మెల్యే మదన్ రెడ్డి పూజలు

దుర్గా మండపాలకు వచ్చిన ఎమ్మెల్యే

కొల్చారం మండలంలో పోతంశెట్టిపల్లి, రాంపూర్, కిష్టాపూర్ గ్రామాలలో నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గామాత మండపం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి దయతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పాడిపంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులు సంతోషంగా ఉన్నారని పంటలు సమృద్ధిగా పండి అభివృద్ధి వైపు సాగుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్ గుప్తా. ఎంపీపీ మంజుల కాశీనాథ్ సర్పంచుల పోరం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సర్పంచ్ గడ్డమీద నాగరాణి నరసింహులు కొల్చారం మండలం గౌడ్ సంఘం అధ్యక్షుడు గజిని రవితేజ ఎంపిటిసి భాగ్యలక్ష్మి సిద్ధి రాములు కోనాపూర్ సంతోష్ రావు సురేష్ గౌడ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News