Saturday, October 5, 2024
HomeతెలంగాణManchireddy: సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

Manchireddy: సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

లబ్దిదారులకు ఆర్థిక సాయం

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాలు, కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శనివారం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై చర్చించి, వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

- Advertisement -

అనంతరం యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామానికి చెందిన ఏ. యాదయ్య కి 60,000 రూపాయలు, ఎన్. నరసమ్మ కి 32,000 రూపాయలు, ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన కే. లాలయ్య కి 32,000 రూపాయలు, బీ. కిష్టమ్మ కి 30,000 రూపాయలు, ఎస్.శేఖర్ కి 24,000 రూపాయలు, ఏ. మంజుల కి 16,000 రూపాయలు, ఎం.డి. సలామ్ బేగం కి 12,000 రూపాయలు మొత్తంగా 2,06,000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మంజూరు చేయించి అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News