Sunday, October 6, 2024
HomeతెలంగాణSankar Naik: కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే

Sankar Naik: కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే

హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్‌ మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్. మహబూబాబాద్ జిల్లా మల్యాల గ్రామంలో కృషి విజ్ఞాన్ కేంద్రం(కేవీకే)కి అనుసంధానంగా హార్టికల్చర్ డిగ్రీ కళాశాల మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే మహబూబాబాద్ పట్టణంలో క్యాంపు కార్యాలయం నుండి నెహ్రు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి నెహ్రూ సెంటర్ వద్ద మల్యాల గ్రామ ప్రజలు, భారాస నాయకులు, కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, జెడ్పిటిసి లునవత్ ప్రియాంక, వైస్ చైర్మన్ ఎండి ఫరీద్, మార్నేని వెంకన్న, గద్దె రవి, యాళ్ల మురళీధర్ రెడ్డి, అశోక్, ఆవుల వెంకన్న, గోగుల రాజు, కౌన్సిలర్లు, సర్పంచులు, భారాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News