Saturday, September 21, 2024
HomeతెలంగాణMLA Vivekanand: వివేకా 'ప్రగతి యాత్ర'కు అడుగడుగునా నీరాజనం

MLA Vivekanand: వివేకా ‘ప్రగతి యాత్ర’కు అడుగడుగునా నీరాజనం

ఎమ్మెల్యే ‘ప్రగతి యాత్ర‘కు అడుగడుగునా జన నీరాజనం పలికారు. 39వ రోజు సూరారం తెలుగుతల్లి నగర్, రాజీవ్ గృహకల్ప తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ప్రజలతో మమేకమై ‘ప్రగతి యాత్ర‘ పేరిట 39వ రోజు పర్యటిస్తున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని తెలుగు తల్లి నగర్, శివసాయి నగర్, రాజీవ్ గృహకల్ప, కుమ్మరి బస్తీ, బాలాజీ క్వాటర్స్, సూరారం కాలనీ (142 యార్డ్స్)లలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ మేరకు పూర్తి చేసిన పలు అభివృద్ధి పనులు పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో మిగిలి ఉన్న భూగర్భడ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలను ఎమ్మెల్యే తెలుసుకొని.. అక్కడే ఉన్న అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రజలకు అసౌకర్యం లేకుండా వెంటనే రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. పేదలకు ఎప్పుడూ అండగా ఉంటామని, అర్హులైన వారందరికీ తప్పక ఇండ్ల పట్టాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బొబ్బ రంగారావు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నె రాజు, రవీందర్ ముదిరాజ్, వెంకటేష్, యూసుఫ్, తారా సింగ్, పందిరి యాదగిరి, అశోక్, రాజ్ కుమార్, ప్రభాకర్, ఇస్మాయిల్, కరాటే శంకర్, శ్రీను, లక్ష్మీ నారాయణ, లక్ష్మణ్, క్రాంతి, మోహన్ నాయక్, కృష్ణా రెడ్డి, భాస్కర్, శ్రీను, భిక్షపతి, నారాయణ, దేవి, సత్యవతి రాథోడ్, సావిత్రి, లక్ష్మీ, జయ, మాధవి, రాధ, ఎం.లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News