Tuesday, September 17, 2024
HomeతెలంగాణMoinabad: దేశం యావత్తూ సుస్థిర కాంగ్రెస్ పాలన కోరుకుంటోంది

Moinabad: దేశం యావత్తూ సుస్థిర కాంగ్రెస్ పాలన కోరుకుంటోంది

రాష్ట్రంలో నిరంకుశత్వ పాలన, దేశంలో మతతత్వ పాలనలతో అవినీతి పార్టీలు రాజ్యమేలుతున్నాయన్నారు టీపీసీసీ సభ్యులు చేవెళ్ల నియోజకవర్గ నాయకులు షాబాద్ దర్శన్. మొయినాబాద్ లో మండల కాంగ్రెస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం పెద్ద మంగళారం పద్మావతి గార్డెన్ లో జరిగింది. మండల కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మాలి మాణయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్ రెడ్డి తదితర సీనియర్ కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. బూటకపు హామీలతో మోసం చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ లకు త్వరలోనే ప్రజలు బొందపెడతారని, కార్యకర్తలు కలసి కట్టుగా పనిచేస్తే కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. అవినీతి పాలనతో మతాల మధ్య చిచ్చు పెడుతున్న పార్టీలకు చరమగీతం చెప్పి, సర్వమత సమ్మేళనంతో, దేశ ప్రజలంతా ఒక్కటిగా చేసిన రాహుల్ గాంధీ హాత్ సే హాత్ జోడో యాత్ర దేశ ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని నింపిందన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం సమన్వయ కమిటీ చైర్మన్ చింపుల సత్యనారాయణ రెడ్డి, టిపిసిసి మాజీ అధికార ప్రతినిధి భీమ్ భరత్,  నియోజకవర్గం నాయకులు సున్నపు వసంతం, డిసిసి మాజీ అధ్యక్షులు వెంకటస్వామి, రాష్ట్ర నాయకులు గౌరీ సతీష్, జనార్దన్ రెడ్డి, మండల సహకార సంఘం చైర్మన్ చంద్రారెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు మోత్కుపల్లి రాములు, ఏ బ్లాక్ మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి, బి బ్లాక్ అద్యక్షులు పోలీస్ మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News