Thursday, September 19, 2024
HomeతెలంగాణMoinabad: కొండా ఆధ్వర్యంలో బీజేపీలోకి చేరికలు

Moinabad: కొండా ఆధ్వర్యంలో బీజేపీలోకి చేరికలు

అలుపెరుగని శ్రామికుడు కొండా

చేవెవేళ్లలో మాజీ ఎంపీ కొండా విశేశ్వర్ రెడ్డి చాలా చాకచక్యంగా పావులు కదుపుతున్నారు. బీజేపీ పటిష్టానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతీ మండలంలోని గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టతకు అలుపెరుగని శ్రామికుడిలా శ్రమిస్తుండడంతో మొయినాబాద్ మండల బీజేపీ పార్టీలోకి కొత్త చేరికలు షురూ అయ్యాయి. మండలంలోని సురంగల్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు సుమారు 15 మంది మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కంజర్ల ప్రకాష్, మండల కార్యదర్షి సీతారామ్ రెడ్డి అద్వర్యంలొ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వారిలో కాంగ్రెస్ నాయకులు యాలాల గౌతంరెడ్డి, కర్రోళ్ల యాదగిరి యాదవ్, నిడుదుల జనార్దన్ రెడ్డి, ఈగ శోభన్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకుడు మేకల గోపాల్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు నిడుదుల మధుసూదన్ రెడ్డి, కొంగరి శ్రీధర్ రెడ్డి, ఉప్పరి రాజు, మంగలి రాము తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు మామిడి మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజ మల్లేష్, సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్హ్, మోరా నర్సింహా రెడ్డి, ప్రభు యాదవ్, వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్, ప్రశాంత్, రాజు, మదు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News