Sunday, October 6, 2024
HomeతెలంగాణMoinabad: జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మంగళారం జంగారెడ్డి నియామకం

Moinabad: జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మంగళారం జంగారెడ్డి నియామకం

బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తా..

మండల పరిధిలోని శ్రీరామ్ నగర్ కు చెందిన మంగళారం జంగారెడ్డి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహ్మరెడ్డి, టీపీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్ చేతులమీదుగా నియామపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చల్లా నర్సింహ్మరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని.. పార్టీ అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. జంగారెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానన్నారు. గ్రామాల్లో పార్టీ విస్తరణకు, పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తానన్నారు.

- Advertisement -

కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాణయ్య, నాయకులు మహేందర్ ముదిరాజ్, రవీందర్రెడ్డి, బిక్షపతి, వెంకటేష్, రియాజ్, మినాజుద్దీన్, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News