Thursday, July 4, 2024
HomeతెలంగాణMunupalli: గొర్రెలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Munupalli: గొర్రెలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

12 మంది లబ్ధిదారులకు 252 గొర్రెలు

మునిపల్లి మండలంలో మక్త క్యాసారం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గొర్రెల్ని పంపిణీ చేశారు. 12 మంది లబ్ధిదారులకు 252 గొర్రెలను ఇచ్చారు. ఈ సందర్భంగా ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ యాదవులకు ఆయన మాట్లాడుతూ యాదవుల సాక్ష్యమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. వచ్చే ఎలక్షన్లో ఘన విజయం సాధించాలని దేశ్ కా నేత కేసీఆర్ మనమందరం కలిసి దేశాన్ని బాగు చేసుకోవాలని, మన తెలంగాణ బంగారు తెలంగాణ సాధ్యమైందని ఎమ్మెల్యే సగర్వంగా చెప్పారు. రాబోయే రోజుల్లో మన తెలంగాణ ఎంతో అభివృద్ధి చెంది, రైతన్నలకు చాలా మేలు జరుగుతుందని భరోసా ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టాభిషేకం చేయాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News