Friday, September 20, 2024
HomeతెలంగాణMustabad: సీఎం రేవంత్ ఫోటోకు పాలాభిషేకం

Mustabad: సీఎం రేవంత్ ఫోటోకు పాలాభిషేకం

అన్ని గ్యారెంటీలను అమలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులను కార్మిక సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర గత ప్రభుత్వం చేసింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ కార్మికులను అక్కున చేర్చుకొని వారికి 21% ఫిట్ మెంట్ పెంచింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించిందని పథకం ప్రారంభించినప్పటి నుంచి 28 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారని, దీనికి ఆర్టిసి ఉద్యోగులు ఎంతో సహకరించారని, అందుకే వారికి సకాలంలో జీతాలు చెల్లిస్తూ వారి జీతభత్యాలు పెంచే కార్యక్రమం చేపట్టి, వారికి అండగా నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తుంది అన్నారు. జీరో కరెంటు బిల్లు రానివారు స్థానికంగా ఉన్న ఎంపీడీవో ఆఫీస్ లో ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ తీసుకెళ్లి ఇవ్వాలి అన్నారు. దీనిపై ఎలాంటి అపోహలు వద్దు అన్నారు. అలాగే ఈరోజు ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా కాళీ జాగా ఉన్నవారికి ఐదు లక్షల సహాయం చేసేందుకు ఈరోజు నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తూ.. పేదింటి కలను నెరవేర్చే కార్యక్రమం తీసుకునీ బడుగు బలహీన వర్గాల బతుకుల్లో వెలుగు నింపే కార్యక్రమం చేస్తుంది అన్నారు. ఇచ్చిన అన్ని గ్యారెంటీలను అమలు చేయడమే కాంగ్రెస్ పార్టీ నైజం అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గుండం నర్సయ్య, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపిటిసి గుండేల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు కొండం రాజిరెడ్డి, మిర్యల్కార్ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, బుర్ర రాములు, సారగొండ రామ్, కొండల్ రెడ్డి, తలారి నర్సింలు,శ్రీల ప్రశాంత్, కుమార్, కొప్పు రమేష్, గాంత రాజు, సడిమేల బాలయ్య, ఆనమేని రాజు, ఓరగంటి తిరుపతి, దీటి నర్సింలు, వేముల సత్యంగౌడ్, దీకొండ దశరథం, మహేందర్, చిట్నేని ఆంజన్ రావు, కలగొండ కిషన్ రావు, కనమెని శ్రీనివాస్ రెడ్డి, మామిండ్ల ఆంజనేయులు, రమణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News