Sunday, October 6, 2024
HomeతెలంగాణMuthireddy Yadagiri Reddy: రంజాన్ మాసం పరమ పవిత్రం

Muthireddy Yadagiri Reddy: రంజాన్ మాసం పరమ పవిత్రం

ముస్లింలకు పరమ పవిత్రమైనది రంజాన్ మాసం అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు సందర్భంగా చేర్యాల మండల కేంద్రంలోని షాదీఖానాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. మత సామరస్యానికి పత్రిక రంజాన్ పండుగని హిందువులు, ముస్లింలు భాయ్ భాయ్ అనుకుంటూ ప్రేమ ఆప్యాయతలతో నిర్వహించుకునే గొప్ప పండుగ రంజాన్ అని అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్, సీఐ పీ. సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జి.రాజేంద్ర కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పుర్మ వెంకట్ రెడ్డి, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు పెడతల ఎల్లారెడ్డి, కొమురవెళ్లి దేవస్థానం డైరెక్టర్ లు కొంగరి గిరిధర్, పచ్చిమడ్ల సిద్దిరాములు గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముస్త్యాల బాల నర్సయ్య, యూత్ నాలుగు మండలాల ఇన్చార్జి శివ గారి అంజయ్య, పట్టణ అధ్యక్షులు యాట బిక్షపతి, చింతల పరశురాములు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News