Thursday, September 19, 2024
HomeతెలంగాణNizamabad: కవితకు సింగరేణి కార్మికుల సమస్యలపై వినతి

Nizamabad: కవితకు సింగరేణి కార్మికుల సమస్యలపై వినతి

సింగరేణి కార్మికుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా

జగిత్యాల పట్టణంలో నిజామాబాద్ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితను మర్యాద పూర్వకంగా కలిశారు టిబిజీకేఎస్ నేతలు.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు సింగరేణి కార్మికుల డిపెండెంట్ ఉద్యోగస్తుల కోసమై 35 సంవత్సరాలు ఉన్న నిబంధనను వన్ టైం సెటిల్మెంట్ కింద 40 సంవత్సరాలు చేయాలని, అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న మారుపేర్ల సమస్యపై, డిస్మిస్ కార్మికుల సైతం మరొక్క మారు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్సీ కవిత సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి చర్చించి సమస్యలను తొందర్లోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News