Saturday, September 21, 2024
HomeతెలంగాణPadi Kaushik: ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి

Padi Kaushik: ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి

విగ్రహ ప్రతిష్ట వేడుకలకు తన వంతుగా లక్ష రూపాయల విరాళం ఇచ్చిన కౌశిక్ రెడ్డి

భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల చల్లని చూపుతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో నిర్వహిస్తున్న భూలక్ష్మి, మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్ట వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ దేవతలను ప్రతిష్టించుకొని గ్రామస్తులందరూ ఐకమత్యంగా ఒకచోట చేరి పండుగ జరుపుకోవడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న ఇలాంటి వేడుకలతో ప్రజలందరూ ఒకరి పట్ల ఒకరు సోదరభావం కలిగి ఉండేందుకు అవకాశం ఉంటుందన్నారు. విగ్రహ ప్రతిష్ట వేడుకలకు తన వంతుగా లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరామ్ శ్యామ్, సర్పంచ్ జక్కెన శ్రీలత సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు మర్రి మల్లేశం, ఉప సర్పంచ్ అశోక్, కో ఆప్షన్ నెంబర్ ఎండి రఫీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News