Monday, September 16, 2024
HomeతెలంగాణMallapur: పంచాయతీ ప్రత్యేకాధికారికి సన్మానం

Mallapur: పంచాయతీ ప్రత్యేకాధికారికి సన్మానం

గ్రామంపై ప్రత్యేక శ్రద్ద చూపాలని విజ్ఞప్తి

కొత్త ధాంరాజ్ పల్లి గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారిగా నియమితులై, బాధ్యతలు స్వీకరించిన మల్లాపూర్ ఎంపీడీఓ రాజ శ్రీనివాస్ ని కాంగ్రెస్ పార్టీ తరుపున సత్కరించారు. గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని, గ్రామంపై ప్రత్యేక శ్రద్ద చూపాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. అనంతరం గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కార్యదర్శిని, అలాగే సర్పంచ్ పదవికాలం పూర్తిచేసి పదవీ విరమణ చేసిన సర్పంచ్ సరిత కమలాకర్ రెడ్డి, వార్డ్ సభ్యుడు రాజేందర్ ని కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బద్దం సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు శంకర్, సుధాకర్, ప్రతాప్, రాజ శేఖర్ రెడ్డి, రవి, లింగా రెడ్డి, ఆది రెడ్డి రమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News