Sunday, November 16, 2025
HomeతెలంగాణPatancheru: కార్యకర్తలకు అండగా నిలిచిన ఏకైక పార్టీ బిఆర్ఎస్

Patancheru: కార్యకర్తలకు అండగా నిలిచిన ఏకైక పార్టీ బిఆర్ఎస్

బిఆర్ఎస్ పార్టీకి వెన్నుముకగా నిలుస్తున్న కార్యకర్తలను అనునిత్యం అండగా నిలుస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామానికి చెందిన చెందిన సత్తరం గణేష్ ఇటీవల ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడికి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో.. పార్టీ తరఫున రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా మంజూరు అయింది. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో మృతుడు భార్య లతకు ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా బిఆర్ఎస్ పార్టీలో పని చేసే ప్రతి కార్యకర్తకు రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని అన్నారు. కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గౌరీ శంకర్, పార్టీ మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad