Friday, September 20, 2024
HomeతెలంగాణPeddapalli: జర్నలిస్టులను దూషించిన నేతపై చర్యలకు డిమాండ్

Peddapalli: జర్నలిస్టులను దూషించిన నేతపై చర్యలకు డిమాండ్

పెద్దపల్లి ఎస్ఐకి ఐజేయు ఫిర్యాదు

జర్నలిస్టులను దుర్భాషలాడుతూ సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేసిన ఒక దళిత నాయకుడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే (ఐజేయు) ప్రతినిధులు పెద్దపల్లి ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఈనెల 4వ తేదీన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాదిగ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన డప్పు చాటింపు వార్తలను బాగా కవర్ చేయలేదనే అక్కస్సుతో అదే సామాజిక వర్గానికి చెందిన కాంపెల్లి ప్రభాకర్ ఈనెల 5వ తేదీన జర్నలిస్టులను దుర్భాషలాడుతూ మాదిగ చైతన్య వేదిక వాట్స్ ఆప్ గ్రూపులో పోస్ట్ చేశాడు. ఆ వీడియో క్రమంగా ఇతర గ్రూపుల్లోను వైరల్ అయింది. జర్నలిస్టులను అవమానపరిచే విధంగా తీవ్రంగా దుర్భాషలాడుతూ వీడియో వైరల్ చేసిన నాయకుడిపై, గ్రూప్ అడ్మిన్మపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా శాఖ ఆధ్వర్యంలో దాడుల నివారణ కమిటీ కన్వీనర్ సి పెళ్లి రాజేశం ఎస్సై మల్లేష్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -

జిల్లా అధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి జక్కని సత్యనారాయణ, పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చింతకింది చంద్ర మొగిలి, సాక్షి స్టాప్ రిపోర్టర్ గుడ్ల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆకుల రమేష్, నాగుల మల్యాల శివకోటయ్య చారి, చేగొండ రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News