Friday, September 20, 2024
HomeతెలంగాణPeddapalli: బాలుసాని మణిదీప్ కు అవార్డు ప్రదానం

Peddapalli: బాలుసాని మణిదీప్ కు అవార్డు ప్రదానం

డెంటల్ విద్యార్థుల కోసం "బుక్స్ డొనేషన్" కార్యక్రమం మొదలు పెట్టి ఉచితంగా బుక్స్ పంపిణీ

పెద్దపల్లి జిల్లా ఎలిగెడు మండలం శివపల్లి గ్రామంకి చెందిన బాలుసాని మణిదీప్ నిజామాబాద్ జిల్లాలో దంత వైద్యం చదువుతూ, తెలంగాణ రాష్ట్ర డెంటల్ విద్యార్థుల కమిటీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో డెంటల్ విద్యార్థుల కోసం “బుక్స్ డొనేషన్” కార్యక్రమం మొదలు పెట్టి ఉచిత బుక్స్ పంపిణీ చేశారు. డెంటల్ విద్యార్థుల కోసం ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేశారు. దాంతో పాటు జాతీయ ఓబీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నరు. ఉత్తమ విద్యార్థి విభాగంలో బాలుసాని మణిదిప్ కి హైదరాబాదులోని హరిహర కళా భవన్ లో గెల్లు శ్రీనివాస్, జగన్ మోహన్ రావు, ఆలీ, ఇతర నాయకులు అవార్డ్ ప్రదానం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News