Saturday, October 5, 2024
HomeతెలంగాణPonnam to Bhumana: హుస్నాబాద్ లో టీటీడీ గుడి కట్టండి

Ponnam to Bhumana: హుస్నాబాద్ లో టీటీడీ గుడి కట్టండి

గుడికి స్థలం సమకూర్చుతా

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. తిరుపతిలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, అనంతరం టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ మంత్రి పొన్నంను సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. హుస్నాబాద్ ప్రజల అభీష్టం మేరకు, హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయంను నిర్మించాలని టిటిడినీ కోరినట్లు తెలిపారు. ఆలయానికి సరిపడా స్థలాన్ని కూడా సమకూరుస్తామని పేర్కొన్నారు. వెంకటేశ్వర స్వామి వారి కృపా, కటాక్షాలు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉండాలని రాష్ట్ర మంత్రిగా ఆ స్వామి వారిని కోరుకున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News