Saturday, July 27, 2024
HomeతెలంగాణRajanna Sirisilla-Teluguprabha effect: కబ్జాకు గురువుతున్న ప్రభుత్వ భూమి స్పందించిన రెవెన్యూ అధికారులు

Rajanna Sirisilla-Teluguprabha effect: కబ్జాకు గురువుతున్న ప్రభుత్వ భూమి స్పందించిన రెవెన్యూ అధికారులు

రంగంలోకి రెవిన్యూ అధికారులు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో ప్రభుత్వ భూమిని (పోరంబోకు భూమి) కబ్జాకారులు తమ అధీనంలో పెట్టుకున్నారు. అర్ధరాత్రి విచ్చలవిడిగా జేసీబీ, ట్రాక్టర్ లతో మట్టి తరలిస్తున్నారు, 216 సర్వే నెంబర్ గల భూమి పక్కన గుట్ట బోరును జేసీబీతో తవ్వి ట్రాక్టర్ లతో మట్టి తరలిస్తున్నారు, లవణ్ పట్టా గల భూమి పక్కన గుట్ట ఉన్నందు వలన ఆ గుట్ట చెట్లు మొత్తం తవ్వి 216 సర్వే నెంబర్ లో పట్టా భూమిలో కలిపేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలుగుప్రభలో వార్త ప్రచురితం కాగా, దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు భూమి వద్దకు వచ్చి పరిశీలించి తగు చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News