Sunday, July 7, 2024
HomeతెలంగాణRajendra Nagar: ఘనంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు

Rajendra Nagar: ఘనంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కొంగరకలాన్ లో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణంలో పంద్రాగస్టు కార్యక్రమాలు కొనసాగాయి. వజ్రోత్సవాల ముగింపు వేళ జరుపుకుంటున్న సంబరాలు కావడంతో జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పుర ప్రముఖులను, అధికార అనధికారులను కలిసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

- Advertisement -

ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు బహూకరించారు. ప్రభుత్వం వివిధ పథకాల కింద మంజూరు చేసిన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పంద్రాగస్టు వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. ఎదనిండా దేశ భక్తిని నింపుకుని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు. మోడల్ స్కూల్, ఆమన్ గల్ కె.జి.బి.వి., గవర్నమెంట్ మోడల్ స్కూల్, శంకర్పల్లి, త్రివేణి స్కూల్, చంపాపేట్, సరూర్ నగర్, ఈ.డి.యు-స్మార్ట్ స్కూల్, హయత్నగర్ విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా చిన్నారులను మంత్రితో పాటు అతిథులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. వేడుకలను పురస్కరించుకుని 13 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెగ్యులరైజేషన్ కు సంబంధించిన ఉత్తర్వులు అందజేశారు.


ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ ఏ.వి.ఎన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్, భూపాల్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ కదివరన్ ఫళని మహేశ్వరం డిసిపి శ్రీనివాస్ జిల్లా రెవిన్యూ అధికారి సంగీత, కలెక్టరేట్ ఏ.ఓ. ప్రమీల రాణి, ప్రజాప్రతినిధులు,అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News