Friday, September 20, 2024
HomeతెలంగాణRajendranagar: ఆర్థికంగా ఎదగడానికే మైనారిటీలకు క్యాబ్స్

Rajendranagar: ఆర్థికంగా ఎదగడానికే మైనారిటీలకు క్యాబ్స్

మైనారిటీల్లో పేదరికం పోయేందుకే..

చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న మైనారిటీలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి క్యాబ్స్ వాహనాలను అందజేసినట్టు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీలకు డ్రైవర్ కమ్ ఓనర్ పథకం శంషాబాద్ మండలం ఆరాంఘర్ లోని మెట్రో క్లాసికల్ గార్డన్ లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రైవర్ కమ్ ఓనర్ పథకం ద్వారా 120 క్యాబ్స్ పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర హోం శాఖ మహమూద్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

- Advertisement -

హోం శాఖ మంత్రి మహమూద్ అలీ రాజేందర్ నగర్ శాసన సభ్యులు ప్రకాష్ గౌడ్ తో కలిసి లబ్దిదారులకు క్యాబ్ లను అందించడం జరిగింది.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,,, సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్ళుతున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనిక పాలన, తెలంగాణలో హిందూ ముస్లిం ఐక్యతను పటిష్టం చేస్తూ, గంగా జమునా తహజీబ్‌ను కాపాడుతూ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. మైనారిటీలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి క్యాబ్స్ వాహనాలను 5 లక్షల రూపాయల సబ్సిడీతో అందజేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధితో పాటు పలు సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందజేస్తూ వారు ఆర్థికంగా బలోపేతం చెందేలా కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను ఆదుకుంటున్నారని అన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం దేశంలోని ఏ రాష్ట్రమూ తెలంగాణ స్థాయిలో బడ్జెట్‌ కేటాయింపులు చేయలేదని వివరించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మైనారిటీ సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తామన్నారు. షాది ముబారక్‌ ద్వారా 9 ఏళ్లలో రెండున్నర లక్షల మంది పెళ్లిళ్లకు మొత్తం రూ. 2,130 కోట్లు ప్రభుత్వం అందించిందన్నారు. ఈ కార్యక్రమంలో రాజేందర్ నగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్, మైనార్టీ ఫైనాన్స్ డైరెక్టర్ క్రాంతి వెల్సీ, మైనారిటీ సంక్షేమ శాఖ ఛైర్మన్ ఇంతియాజ్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నవీన్ కుమార్ రెడ్డి, రాజేందర్ నగర్ కార్పొరేటర్ అర్చన, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News