Friday, September 20, 2024
HomeతెలంగాణRohit Reddy: కులవృత్తులపై ఆధారపడ్డవారికి లక్ష రూపాయల గ్రాంట్

Rohit Reddy: కులవృత్తులపై ఆధారపడ్డవారికి లక్ష రూపాయల గ్రాంట్

రోహిత్ రెడ్డి జిందాబాద్ అంటూ మారుమ్రోగిన నినాదాలు

బషీరాబాద్ మండలం కోర్విచెడ్ గ్రామానికి చెందిన మంగలి జగదీష్ కి కులవృత్తికి రూ. 1లక్ష రూపాయలు చెక్కును తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేతుల మీదుగా లక్ష రూపాయలు చెక్కు అందజేశారు. కేంద్ర ప్రభుత్వంలో లేని పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో పథకాలను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ పథకాలను చూసి వేరే రాష్ట్రము ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రములో ఈ పథకాలు ఎట్లా ఇస్తున్నారని కొందరు దిగులు చెందుతున్నారన్నారు. ఎన్నో వేల మంది తాండూరు నియోజకవర్గ ప్రజలు లబ్దిపొందుతున్నారన్నారు. వచ్చే ఎలక్షన్లో కెసిఆర్ జిందాబాద్ రోహిత్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ఈ కులవృత్తుల వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొర్విచేడ్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎస్ రాజు,మంగలి జగ్గు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News