Thursday, June 26, 2025
HomeతెలంగాణRevanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్‌ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్‌ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫార్ములా ఈ రేస్(Formula E Race) కేసులో అసలు ముద్దాయిగా సీఎం రేవంత్ రెడ్డిని చేర్చాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తీరుతో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కి పోయాయని ఆరోపించారు.

- Advertisement -

ఇదిలా ఉంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేస్‌లో అవినీతి జరిగిందని పేర్కొంటూ మాజీ మంత్రి కేటీఆర్(KTR)పై ఏసీబీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏసీబీ, ఈడీ విచారణకు కూడా ఆయన హాజరయ్యారు. కేటీఆర్‌తో పాటు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌, హెచ్‌ఎండీఏ రిటైర్డ్ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌రెడ్డిపై కూడా ఏసీబీ, ఈడీ కేసులు నమోదయ్యాయి. వారు కూడా విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకునపెట్టేలా బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News