Sunday, July 7, 2024
HomeతెలంగాణSabitha Indrareddy: కేసీఆర్ ను తిట్టేందుకే అమిత్ షా వస్తున్నారా?

Sabitha Indrareddy: కేసీఆర్ ను తిట్టేందుకే అమిత్ షా వస్తున్నారా?

సోదర భావంతో ఉన్న ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికే అమిత్ షా తెలంగాణ వస్తున్నారా…? అంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విజయ సంకల్ప యాత్రపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. భారీ బహిరంగ సభకు షా వస్తున్న సందర్బంగా… రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తొమ్మిది సంవత్సరాల కాలంలో తెలంగాణకు బిజిపి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని వారు ప్రశ్నించారు. మీరు చెప్పుకోవడానికి ఏముందని మూడుసార్లు పర్యటిస్తున్నారన్నారు. కెసిఆర్ ఒక విజన్ తో పనిచేస్తారని రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకంతో చెర్లు కుంటలు కత్వా కాలువలు పల్లెలన్నీ నిండుకుండలా ఉన్నాయన్నారు. పల్లె ప్రగతిని పంచే ఈ పథకాన్ని దేశమంతట విస్తరింప చేయగలరా..! అని వారి ప్రశ్నించారు. కాలేశ్వరం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించినందుకా అని వారన్నారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్రానికి రైల్వే కోచ్ మెడికల్ కాలేజెస్ నవోదయ స్కూల్స్ ఇవ్వలేమని చెప్పడానికి వస్తున్నారా అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు 84 నవోదయ పాఠశాలలు ఇచ్చి తెలంగాణకు ఎందుకు ఇవ్వలేరని వారు మండిపడ్డారు. ముఖ్యంగా సాగులో వెనుకబడి ఉన్న రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి బిజెపి ఎం చేసిందని వారి ప్రశ్నించారు. మీకు తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఐటిఐఆర్ వెనక్కి ఇవ్వగలరా..అని వారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలపైబిజెపి వివక్ష చూపిస్తుందన్నారు. వరదలు వచ్చి హైదరాబాద్ అతలాకుతలం అయితే చెల్లి గవ్వ ఇవ్వలేరన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ఇసుమంత కూడా బిజెపి భాగస్వామ్యం లేదన్నారు. రేపు జరిగే సభలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టె మాటలు మాట్లాడకుండా మీరు వెళ్లగలరా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ…. దేశంలో ఉన్న ఏ ఒక్క వర్గానికి కూడా బిజెపి న్యాయం చేయలేదన్నారు. దళితులకు మహిళలకు కార్మికులకు రైతులకు ఏం చేశారని వారి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి రెండు మూడు వేలు ఇస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 33 జిల్లాలకు నూతన కలెక్టర్ కార్యాలయాలను నిర్మించిన ఘనత కేసీఆర్ అన్నారు. జిల్లాకు ఒక కలెక్టర్ ను ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో బిజెపి ఉందన్నారు. కెసి ఆర్ రాష్ట్రంలో ఐదు వేల క్లస్టర్లను ఏర్పాటు చేసి ఏఈఓలను పెట్టి 25 లక్షలతో రైతు వేదికలను నిర్మించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ గ్రామపంచాయతీ హోదా తెలంగాణలోని గ్రామాలు పొందుతున్నాయన్నారు. కాలేశ్వరం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులను జాతీయ హోదా రద్దు చేసినందుకు వస్తున్నారా..? అని సబిత ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు చేసిన ఏది ఏమైనా కేసీఆర్ వెంటే ప్రజలు ఉంటారన్నారు. మూడోసారి గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా యాక్ట్రిక్ కొట్టనున్నారని వారు ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News