Sunday, October 6, 2024
HomeతెలంగాణSandra son's in campaign: సండ్ర తోనే సత్తుపల్లి అభివృద్ధి

Sandra son’s in campaign: సండ్ర తోనే సత్తుపల్లి అభివృద్ధి

తండ్రి గెలుపు కోసం తనయులు భార్గవ్, తేజ..

కల్లూరు మండల పరిధిలోని చిన్నకోరుకోండి గ్రామంలో ప్రతి ఇంటికి, గడప గడప తిరుగుతూ సత్తుపల్లి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ ఆయన కుమారులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యని గెలిపించాలని, ప్రతి ఒక్కరిని కలుసుకొని బిఆర్ఎస్ మేనిఫెస్టోను వివరిస్తున్నారు.. ఎమ్మెల్యే సండ్ర కుమారులు భార్గవ్, తేజ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలనుండి సత్తుపల్లిలో మా నాన్నని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తున్నారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ అనుక్షణం నియోజకవర్గ ప్రజల గురించే ఆయన తపన, ఈ నియోజకవర్గం అభివృద్ధికి 1000 కోట్ల రూపాయల నిధులు తెచ్చి సత్తుపల్లినీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మీ ముందు ఉంచారు. మళ్ళీ నాల్గవ సారి ఈ నెల 30 వ తారీకు జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కార్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో మళ్ళీ మీ అందరూ ఆశీర్వాదించి, గెలిపించి అసెంబ్లీకి పంపే బాధ్యత మీదేనన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ నామ రాధమ్మ వెంకటేశ్వర్లు, సొసైటీ చైర్మన్ చావ వెంకటేశ్వర్లు, సొసైటీ వైస్ చైర్మన్ తోట కనక రావు, సొసైటీ డైరెక్టర్ నామా మెస్సయ్య , ఎంపీటీసీ జిల్లెల్ల మార్తమ్మ, గ్రామ శాఖ అధ్యక్షులు చిన్నాల సుబ్బారావు, రైతు సమన్వయ కమిటీ చైర్మన్ ఖమ్మంపాటి కృష్ణయ్య, మాజీ ఎంపీటీసీ రెడ్డి తిరుపతిరావు, ఉన్నం రాజా, షేక్ ఖాదర్, మాడుగుల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News