Friday, September 20, 2024
HomeతెలంగాణSandra: తెలంగాణ రన్ కు విశేష స్పందన

Sandra: తెలంగాణ రన్ కు విశేష స్పందన

అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, విద్యాలయాలు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థలు రన్ కు తరలివచ్చారు

సత్తుపల్లిలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన తెలంగాణ రన్ కు విశేష స్పందన వచ్చింది. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, విద్యాలయాలు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థలు రన్ కు తరలివచ్చారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నిర్వహించిన తెలంగాణ రన్ ను జండా ఊపి ప్రారంభించారు. జేవిఆర్ డిగ్రీ కళాశాల నుండి పట్టణంలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ వరకు తెలంగాణ టు కే రన్ ను నిర్వహించారు.

- Advertisement -

తెలంగాణ ప్రగతిని నలువైపులా చాటి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో కార్యక్రమాలను చేపడుతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.ఈ కార్యక్రమంలో కల్లూరు ఏ.సి.పి రామానుజం, కమాండెంట్ జలీల్ ఖాన్జి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, ఆర్.డి.ఓ సూర్య నారాయణ, మున్సిపల్ కమిషనర్ సుజాత, ఎం.డి.ఓ సుభాషిణి, ఎఫ్.ఆర్.ఓ వెంకటేశ్వర్లు, సి.ఐ లు కరుణాకర్, హనోక్, ఆత్మ చైర్మన్ వనమా వాసు, మండల పార్టీ అధ్యక్షులు యాగంటి శ్రీనివాసరావు, కానగల వెంకటరావు, ఎంపీపీలు దొడ్డ హైమావతి, పగుట్ల వెంకటేశ్వరరావు, జడ్పీటీసీలు కుసంపూడి రామారావు, చెక్కిలాల మోహన్ రావు తదితర అధికార సిబ్బంది, నాయకులున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News