Saturday, October 5, 2024
HomeతెలంగాణSathupalli: సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి 50 కోట్లు

Sathupalli: సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి 50 కోట్లు

సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి 50 కోట్ల రూపాయల SDF నిధులు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరో 75 లక్షల రూపాయలతో పెనుబల్లి మండల కేంద్రంలో షాదీఖానా నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. పెనుబల్లి మండలంలో 75 లక్షల రూపాయలతో నూతన షాదీ ఖానా నిర్మాణానికి, నియోజకవర్గ అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జీవోను విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నిధులు మంజూరు పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య. సత్తుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన సందర్భంగా వినతి పత్రాలను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అందజేయగా.. సత్తుపల్లి నియోజకవర్గంలో సిసి రోడ్లు, ఇతరత్రా ప్రజా అవసర అభివృద్ధి పనులకు 50 కోట్ల రూపాయల SDF నిధులను, పెనుబల్లి మండల కేంద్రంలో షాదీ ఖానా నిర్మాణానికి 75 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోలను విడుదల చేసింది. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తూ నిధులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News