కల్లూరు మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన 300 మంది లబ్ధిదారులకు బీసీ బంధు ద్వారా మంజూరైన కుల వృత్తిదారులకు ఒక లక్ష రూపాయల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పంపిణీ చేశారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/e0d562c8-a9f0-4a90-8aac-77b17a2a3205-1024x682.jpg)
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలకు కల్యాణలక్ష్మి వర్తిస్తున్నట్లు బీసీ బంధు కూడా రాబోయే రోజుల్లో అందరికీ వర్తిస్తుందని, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన గొప్ప ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని కొనియాడారు. యాదవ సోదరులకు గొర్రెలు ఇవ్వాలని, గౌడ సోదరులకు చెట్టు పన్ను రద్దు చేయాలని ఏ ప్రభుత్వము ఆలోచన చేయలేదని వాటన్నిటిని తెలంగాణ ప్రభుత్వం చేసి చూపించిందని వివరించారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/4a1774b7-31a1-4571-9ef5-1b9e939d773d-1024x682.jpg)
నియోజకవర్గంలో చెక్ డ్యాం లు, వంతెనల నిర్మాణానికి 58 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారని తెలిపారు. ఎన్నికలు వస్తున్న సమయంలో అభివృద్ధి పనులు మేము చేస్తామంటూ మాయమాటలు చెబుతూ వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు..
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/56d82fa1-8fed-4a65-9b89-2ba37da31366-1024x682.jpg)