Friday, October 18, 2024
HomeతెలంగాణSerilingampalli: ముఖ్య నాయకులతో గాంధీ భేటీ

Serilingampalli: ముఖ్య నాయకులతో గాంధీ భేటీ

ఉట్ల బ్రదర్స్ తో కీలక చర్చలు

బీఆర్ఎస్ శేరిలింగంపల్లి అభ్యర్థి అరికేపూడి గాంధీ శేరిలింగంపల్లిలోని ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. శేరిలింగంపల్లి కొత్తగూడకు చెందిన ఇద్దరు సీనియర్ అన్నదమ్ములు, ఉట్ల కృష్ణ, ఉట్ల దశరథ్ లను కలిసి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ముఖ్య నాయకుల సమావేశంలో భాగంగా అరికెపూడి గాంధీ, ఇద్దరు అన్నదమ్ములతో ముచ్చటించారు.

- Advertisement -

ఉట్ల కృష్ణ, ఉట్ల దశరథ్ లు ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పార్టీ అనుసరించే వ్యూహాలను, ముఖ్య నాయకుల సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుకుమార్, డాక్టర్ కృష్ణ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News